వ్యక్తి మృతి
కామారెడ్డి, అక్టోబర్ 25(విజయక్రాంతి): మంచంపై పడుకున్న సమయంలో సెల్ఫోన్ చార్జింగ్ వైర్ ద్వారా విద్యుదాఘాతం అయి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కామారెడ్డి జిల్లా యాచారం తండాలో విషాదాన్ని నింపింది. సదాశివగర్ ఎస్ఐ రంజిత్ తెలిపిన వివరాలు.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం తండాకు చెందిన మాలోత్ అనిల్(23) గురువారం రాత్రి సెల్ఫోన్ చార్జింగ్ అనంతరం వైర్ను స్విచ్ నుంచి తీయకుండా మంచంపై అలాగే పడుకున్నాడు.
కగా అనిల్ నిద్రలో ఉన్నప్పుడు సెల్ఫోన్ చార్జర్ వైర్ అతడి కాలుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.