12-03-2025 10:18:35 PM
తెలంగాణ భవన్ లో రవి ప్రమాదవశాత్తు జారిపడడంతో విరిగిన కాలు
ఎల్బీనగర్: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, తెలంగాణ కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ తెలంగాణ భవన్ లో మంగళవారం ప్రమాదవశాత్తు జారీ పడడంతో కాలు కు తీవ్ర గాయమై విరిగింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు. గాయపడిన పల్లె రవికుమార్ ను బుధవారం సరూర్ నగర్ లోని ఆయన నివాసంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. రవితో కాసేపు ముచ్చటించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కవితతోపాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, విశ్వంభర దిన పత్రిక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాచం సుష్మ, హైదరాబాద్ జిల్లా శిశు మహిళా సంక్షేమ శాఖ మాజీ జిల్లా ఆర్గనైజర్ సుశీలా రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్ల శివ శంకర్ నేత, మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజ్ శేఖర్ రెడ్డి, జీవీ సాగర్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, నాయకులు ఆడాల రమేశ్, లోకసాని కొండల్ రెడ్డి, మాధవరం నర్సింగరావు, బోయపల్లి రమేశ్ గౌడ్, రామ్ కోటి, కూర రమేశ్, పార్వతి గౌడ్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.