29-03-2025 07:58:41 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండల కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాల భైరవ స్వామి ఆలయాన్ని శనివారం ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, లింగంపేట మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, సదాశివనగర్ మాజీ జడ్పీ సభ్యుడు రాజేశ్వరరావు స్వాగతం పలికారు. ఆమె వెంట జిల్లా మాజీ గ్రంథాల సంస్థ ఛైర్మన్ సంపత్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కపిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.