calender_icon.png 1 October, 2024 | 3:07 PM

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

01-10-2024 11:40:18 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రిలో చేరారు.  వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్ కి వెళ్లారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలుతో బాధపడ్డారు. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిమ్స్ లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ఆసుపత్రిలో చేరారు. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి అవుతాయని కవిత సన్నిహితులు చెబుతున్నారు.