11-02-2025 01:04:31 AM
కామారెడ్డి ఫిబ్రవరి 10,(విజయ క్రాంతి): పట్టభద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి కళ్యాణ మండపంలో మండల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు మండల బిజెపి కార్యకర్తలతో మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి,బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచేని జగదీష్ ,అంజల్ రెడ్డి, గాజులపల్లి కాశిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , బి జే వై ఏం అద్యక్షుడు మనోజ్ , కార్యకర్తలు పాల్గొన్నారు.