calender_icon.png 29 September, 2024 | 6:56 PM

ఫలితాలు రాబట్టే ఎమ్మెల్సీ కావాలి

29-09-2024 04:29:14 PM

కరీంనగర్,(విజయక్రాంతి): లక్ష్ విద్యా సంస్థల అధినేత  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ముస్తాఖ్ అలీ ఖాన్  ఆదివారం ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ముస్తాఖ్ అలీ ఖాన్  పిలుపుని అందుకున్న పట్టభద్రులు  కార్యక్రమంలో చైతన్యంగా పాల్గొన్నారు. పట్టభద్రులను ఉద్దేశించి ముస్తాఖ్ అలీ ఖాన్   మాట్లాడుతూ... ప్రతి వ్యక్తి గ్రాడ్యుయేషన్ పొందడానికి ఎంతో శ్రమను ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి, రాబోయే తరం యొక్క భవిష్యత్తుకు బాటలు వేసేది వీరే. అయితే పట్టభద్రుల అభిప్రాయాన్ని   శాసనమండలిలో బలంగా వినిపించగలిగే నాయకున్ని ఎన్నుకున్నప్పుడే ఇదంతా సఫలీకృతం అవుతుంది. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా యువతే ప్రధానమైన శక్తి. ఆ యువతకు సంపాదించగలిగిన మార్గాన్ని చూపెట్టినప్పుడు అభివృద్ధి  పరుగందుకుంటుందన్నారు. విద్యారంగంలో కార్పొరేట్ స్థాయిలో నాకున్న అనుభవం దృష్ట్యా నేను ఆ దారిని చూపెట్టే  మార్గదర్శిని కావాలని అనుకుంటున్నాను. నా యొక్క స్వార్థం లేని ఈ ఆశయానికి పట్టభద్రుల మద్దతు  అనివార్యం  అంటూ  తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.