calender_icon.png 28 September, 2024 | 2:53 PM

నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తా..

28-09-2024 11:34:27 AM

కరీంనగర్ లో వాకర్స్ ను కలసి మద్దతు కోరిన పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా నిలువడానికి సేవకుడుగా పని చేసేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్ జ్యోతిబా పూలే, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ తో  సమావేశం నిర్వహించారు.

రానున్న పట్ట భద్రుల ఎన్నికల్లో  తనకు  మద్దతు తెలపాలని కోరారు. గత 34 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలు అందించానని, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు తప్పకుండా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటివరకు చాలా మంది నాయకులు రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేశారని, కాని నేను మాత్రం ఒక సేవకుడుగా పనిచేస్తానని పట్ట భద్రులకు భరోసా ఇచ్చారు. నన్ను అందరించండి మీ అండగా నేనూంటని అని అన్నారు.