25-04-2025 12:56:17 AM
కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 24 : నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురువారం కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీవా సులను తాగునీటి సమస్య మరియు వివిధ సమస్యల గురించిఅడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత తొందరలో సమస్య తీరుతుందని మాట ఇవ్వడం జరిగింది.