జనరల్ హాస్పిటల్ లో వయోవృద్ధుల క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): వయోవృద్ధులకు వైద్య చికిత్సల నిమిత్తం ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ప్రత్యేక క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వయోవృద్ధుల క్లినిక్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వయవృద్ధులను మీ కుటుంబ సభ్యులుగా భావించి అవసరమైన వైద్య సేవలను అందించాలని సూచించారు. వారి ఆలోచనలను ఎంతో విలువైనయని మంచి వైద్య సేవలు అందించి వారి సలహాలు సూచనలు కూడా మెరుగైన సమాజం కోసం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు వైరుధ్యులకు ఈ ప్రత్యేక క్లినిక్ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, సదుల్లా, ఆర్ఎంఓ డాక్టర్ దుర్గ, ఆర్ఎంఓ డాక్టర్ జరీనా భాను, డాక్టర్ శిరీష, డాక్టర్ గణేష్, డాక్టర్ శ్వేత, డాక్టర్ సమత, తదితరులు పాల్గొన్నారు.