22-04-2025 08:26:40 PM
పాలాభిషేకం చేసిన మద్నూర్ కాంగ్రెస్ నాయకులు....
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని జొన్న రైతులకు ఊరట లభించింది. ఇప్పటివరకు ఎకరాకు 8 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్న జొన్నల పరిమితిని, ఎకరాకు 14 క్వింటాళ్లుగా పెంచే దిశగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు(Minister Sri Tummala Nageswara Rao)తో చర్చించి, ప్రభావవంతంగా కృషి చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు రైతుల తరఫున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంలో మద్నూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఫోటోలకు పాలభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పాలనపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ హనుమాన్ మందిర్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ హన్మంత్ యాదవ్ అయిలవార్ రమేష్ వట్నాలవార్ రమేష్ సంతోష్ పటేల్ మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ హనుమాన్ స్వామి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.