calender_icon.png 18 October, 2024 | 4:55 PM

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

18-10-2024 02:50:36 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని చాకేపల్లి గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రెండు లక్షలకు పైగా ఉన్న రుణమాఫీ కానీ రైతులు వెంటనే అప్పులను చెల్లిస్తే ప్రభుత్వo రుణమాఫీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. వడ్ల కొనుగోలు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే వినోద్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్, ఎంపీడీవో మహేందర్, మాజీ ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్, చంద్రవెల్లి సహకార సంఘం చైర్మన్ చింతం స్వామి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ, నాయకులు మార్త బాపు, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.