calender_icon.png 23 October, 2024 | 3:46 PM

సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

23-10-2024 01:49:32 PM

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలం గోలియాతండ గ్రామపంచాయతిలో డి.ఎం.ఎఫ్.టీ నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీల సంక్షేమ పథకాలు అన్ని పేదలకు అందరికి అందుతాయన్నారు.

ప్రతిపక్ష నాయకులు వారి రాజకీయ లబ్ది కోసం, ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పినా ఎవరు నమ్మకూడదని, మీరందరు నాకు ఆశీర్వదించి అసెంబ్లీకీ పంపి మీకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీడీవో రవీందర్ రావు, ఎంపీవో గణేష్ గాంధీ, సిఐ సురేష్, బొడు ఎస్ఐ శ్రీకాంత్, కార్యదర్శి వీ.ప్రశాంత్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూక్య దేవా, తాజా మాజీ సర్పంచ్ బోడ నిరోషా మంగీలాల్ నాయక్, బోడ సరిత, బండ్ల రజినిశ్రీనివాస్, ఇస్లావత్ రెడ్యానాయక్, ఈది గణేష్, మూడు సంజయ్, సర్దార్, రవి, గడ్డం మధురెడ్డి, శంకర్, మాడే మధు, పోషాలు, అనంతుల వెంకన్న, బోడ హరిలాల్ నాయక్, సామ్య, శ్రీను, మంగ్య పాల్గొన్నారు.