23-03-2025 04:58:54 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో గల మాజీ కౌన్సిలర్ చిట్యాల మధు తల్లి అనసూర్య దశదినకర్మకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరై అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా అనసూర్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వినోద్ వెంట కౌన్సిలర్లు గెల్లి రాయలింగు, కొమ్ముల సురేష్ లతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.