calender_icon.png 27 October, 2024 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్ నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వినోద్

27-10-2024 03:55:36 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూరు మండలంలోని బోయపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుందిళ్ల భూమయ్య కుటుంబ సభ్యులను ఆదివారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ భూమయ్యకు వైద్య చికిత్సల కోసం రూ 30,000 ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే వినోద్ ఆయన ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సుందిళ్ల భూమయ్య కుటుంబానికి అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని ఎమ్మెల్యే వినోద్ ధైర్యం కల్పించారు. అంతకుముందు బోయపల్లి మీదుగా గోండుగూడెం నుండి బుగ్గ దేవాలయానికి రూ. 2కోట్ల 60 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్డు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే వినోద్ వెంట టిపిసిసి రాష్ట్ర ప్రచార జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తొంగల మల్లేష్, నాయకులు సూరం రవీందర్ రెడ్డి, సిరంగి శంకర్, మాసాడి తిరుపతి, సంకురి శంకర్, ముడిమడుగుల మహేందర్, దుర్గం గోపాల్, మాసాడి నారాయణ, వేణుగోపాల్, మాసాడి భీమయ్య, భీమ రాజ్ కుమార్, ఇప్ప రవి తదితరులు పాల్గొన్నారు.