11-04-2025 04:18:17 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణానికి చెందిన హనుమాండ్ల పోశం అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇతని ఆరోగ్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ 4 లక్షల ఎల్ఓసి చెక్కును శుక్రవారం అతని కుమారుడు హనుమాండ్ల మధుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ అందజేసి అండగా నిలిచారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అధికంగా ప్రాముఖ్యతనిస్తుందని ఎమ్మెల్యే వినోద్ చెప్పారు.