calender_icon.png 1 October, 2024 | 12:55 PM

శస్త్రచికిత్స చేసిన ఎమ్మెల్యే వెంకట్రావు

01-10-2024 12:00:00 AM

మహిళ కడుపులో నుంచి 15 కిలోల నీటి గడ్డ తొలగింపు

భద్రాచలం, సెప్టెంబర్ 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని నిఖిత ఆసుప త్రిలో సోమవారం ఆసుపత్రి అధినేత, భద్రాలచం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శస్త్ర చికిత్స చేసి ఓ మహిళ కడుపులో నుంచి 15 కిలోల నీటి గడ్డను తొలగించి ప్రాణాన్ని కాపాడారు. సోమవారం భద్రాచలం నిఖిత ఆసుపత్రికి ఏ పీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన కుంజ రత్తమ్మ తీవ్రమైన కడుపు నొప్పితో వ చ్చారు.

స్కానింగ్ చేయగా కడుపులో 15 కిలో ల నీటి గడ్డలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు గంటన్నరపాటు ఎమ్మెల్యే వెంకట్రావు ఆపరేషన్ చేసి నీటి గడ్డలను తొలగించారు. ఆసుప త్రిలో చేరిన వెంటనే స్పందించి ఆపరేషన్ చేసి ప్రాణాలుకాపాడిన వెంకట్రావుకు మహిళ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.