జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
కామారెడ్డి,(విజయక్రాంతి): అలయ్-బలయ్ కార్యక్రమాలతో ప్రజల్లో ఐక్యమత్యం పెరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అలాబలై కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అలై బలై చేసుకున్నారు. సంస్కృతి సాంప్రదాయాల కలయికల్లో భాగంగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మతసామరస్యం ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లాయ్ బలై కార్యక్రమం సందడిగా కార్యకర్తలతో నాయకులతో ఎమ్మెల్యే పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలిపారు.