calender_icon.png 23 October, 2024 | 5:57 AM

విద్యాభివృద్ధికి కృషి ఎమ్మెల్యే రామారావు పటేల్

23-10-2024 01:16:03 AM

భైంసా, అక్టోబర్ 22: ముథోల్ నియోజవకర్గంలో విద్యారంగంలో సమస్యలు పరిష్కరించి, విద్యాభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. ఇటీవల నియోజకవర్గ కేంద్రానికి కొత్తగా మంజూరైన ప్రభుత్వ డిగ్రీకశాలను ముథోల్‌లో మంగళవారం ఆయన ప్రారంభించారు.

కొత్తకోర్సుల ప్రారంభానికి, పూర్తిస్థాయిలో బోధ న, బోధనేతర సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని చెప్పా రు. విద్యార్థులు కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కర్రోల్ల బుచ్చయ్య, నిర్మల్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.