25-02-2025 04:13:36 PM
బైంసా,(విజయక్రాంతి): విద్యార్థులు ఇష్టంతో చదువుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. తాండూరు మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వార్షికోత్సవంలో పాల్గొన్నారు. పోటీ ప్రపంచంలో చదువుతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే సరైన ఫలితాలు లభిస్తాయన్నారు. ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు.