calender_icon.png 17 October, 2024 | 11:55 PM

కొమురం భీం విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పీఎస్ఆర్

17-10-2024 09:45:23 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల నియోజక వర్గ శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ రావు గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీం 84వ వర్ధంతి సందర్భంగా గురువారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన భీం వర్ధంతి వేడుకలలో శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ, గిరిజన నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు.