calender_icon.png 26 October, 2024 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెలాఖరులోగా అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు

01-09-2024 09:10:05 PM

ఎమ్మెల్యే పీఎస్ఆర్

మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల నియోజక వర్గంలో ఈ నెలాఖరులోగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు అన్నారు. ఆది వారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఐబీ స్థలంలో సూపర్ స్పెపాలిటీ ఆసుపత్రి నిర్మాణం, రాళ్లవాగు వరద ముంపు రాకుండా కరకట్ట, ఎత్తిపోతల పథకాలకు శంఖుస్థాపనలుంటాయన్నారు. ముల్కల నుంచి బసంత్ నగర్ వరకు గోదావరి నదిపై రూ.375 కోట్లతో బ్రిడ్జినిర్మాణ పనులు జరుగుతాయన్నారు. అలాగే రెండవ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయన్నారు. రూ. 164 కోట్లతో శ్రీనివాస గార్డెన్ నుంచి క్వారీ రోడ్, పాత మంచిర్యాల మీదుగా నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లాయన్నారు. ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందుతుందని, రూ.2 లక్షలు మాఫీ అవుతాయని, రైతులు అధైర్య పడవద్దన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ కూడా ఉంటుందని, తాను ఏ హోదాలో ఉన్నా నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను, చెరువుల కబ్జాలను, అవినీతిని సహించబోమని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.