calender_icon.png 8 September, 2024 | 9:08 AM

జూలై ముగుస్తున్న ఫసల్ బీమా అమలు ఊసే లేదు: పాయల్ శంకర్

27-07-2024 03:25:12 PM

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేస్తామని చెప్పింది.. జులై ముగుస్తున్న ఇంకా అమలు చేయడం లేదని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితిపై శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండని పాయల్ శంకర్ కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ ద్వారా నిధులు దొరికేవన్నారు. పదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ లో నిధులు లేవని ఆయన సూచించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని శంకర్ వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికలను నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు రావని చెప్పారు.