calender_icon.png 20 September, 2024 | 10:52 PM

ఎరువుల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

20-09-2024 08:34:23 PM

చేర్యాల,(విజయక్రాంతి): చేర్యాల పట్టణంలోని శ్రీ సాయిశివ ఫర్టిలైజర్స్ ఎరుల దుకాణాన్ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ఫర్టిలైజర్స్ దుకాణంలోని ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డిని  శ్రీ సాయిశివ ఫర్టిలైజర్స్ యజమాని, బీఆర్ఎస్ నేత చేతిరెడ్డి సందీప్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి మిఠాయి తినిపించారు. ఈ మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా షాపుల యాజమాన్యాలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు అధైర్యపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే పల్లా తెలిపారు. అయన వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్  చంటి, ఏరోళ్ల రామచంద్రం, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ మల్లారెడ్డి, పుల్ల రవి,బుట్టి శ్రీను, ఎలుగల సంపత్, పార్టీ నాయకులు,  కార్యకర్తలు తదితరులు ఉన్నారు.