calender_icon.png 22 October, 2024 | 4:49 AM

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం..

21-10-2024 09:05:21 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని  రాంనగర్ డివిజన్ కు చెందిన 11మంది లబ్ధిదారులకు రూ. 3,98,000 విలువగల చెక్కులను పంపిణీ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు టి. శంకర్ ముదిరాజ్, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, నాయకులు ముదిగొండ మురళి, ఇంద్రసేనారెడ్డి, జ్ఞానేశ్వర్ గౌడ్, గోక నవీన్, బల్వీర్ కుమార్, కళ్యాణ్ నాయక్, టీవీ రాజు, పోస్టర్ శ్రీను, గండు వెంకటేష్, వాసు, మహిళా అధ్యక్షురాలు నీలాదేవి, తులసి, మంజుల, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.