calender_icon.png 22 October, 2024 | 8:06 PM

రైల్వే సమస్యలను పరిష్కరించాలని జీఎం ను కలిసిన ఎమ్మెల్యే..

22-10-2024 05:31:21 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని రైల్వే సమస్యల పరిష్కారం కోసం సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను మంగళవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కలిశారు. రేచిని రోడ్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పొడిగింపు, సింగరేణి రామగిరి ట్రైన్ హాల్టింగ్ సౌకర్యం, మౌలిక సదుపాయాల గురించి ఆయనతో మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ గారు స్థానుకూలంగా స్పందించి అధికారులతో డీఈ వామన్ మూర్తి, డీజీఎం విశాల్ లతో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు తాండూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సూరం రవీందర్ రెడ్డి, గట్టు మురళీధర్, సాలిగామ బానయ్య పాల్గొన్నారు.