calender_icon.png 30 September, 2024 | 7:28 PM

వైద్య సేవలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

30-09-2024 05:45:37 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్లు అందించాలని నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తప్పవని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలో  కాసర్ల పాడు గ్రామంలో  సోమవారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా  పరిశీలించి రికార్డులు తనిఖీ చేసి  వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచనలు చేశారు. లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.