01-04-2025 02:11:09 AM
మేడ్చల్, మార్చి 31 (విజయ క్రాంతి): మేడ్చల్ మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పరామర్శించారు. గణేష్ ఇటీవల ప్రమాదంలో గాయపడ్డాడు. గణేష్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పూడూరులో ఇటీవల మరణించిన సీనియర్ నాయకుడు బాలానందం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లారెడ్డి వెంట జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, దయానంద యాదవ్ తదితరులున్నారు.