calender_icon.png 25 October, 2024 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టులో ఎమ్మెల్యే కోవా లక్ష్మికి ఊరట

25-10-2024 01:40:08 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర హైకోర్టులో కోవాలక్ష్మికి వ్యతిరేకంగా ఎన్నికల సందర్భంగా దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. కోవాలక్ష్మి ఎన్నికల అఫిడవిట్లో ఆదాయపన్ను (ఇన్కమ్ టాక్స్) లెక్కలు తప్పులు ఉన్నాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్ కోర్టుకు ఎక్కారు. 2023 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని తన ఎన్నిక చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోవ లక్ష్మి 2023 ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచిందని పిటిషన్ వేశారు. ఈ కేసు గత తొమ్మిది నెలలుగా కొనసాగుతోంది. అయితే.. ఇవాళ కేసు విచారించిన హైకోర్టు దానిని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవలక్ష్మి ఎన్నికల అఫిడవిట్ లో ఇన్కమ్ టాక్స్ లెక్కలు తప్పులు లేవని తేల్చేసింది.