calender_icon.png 23 September, 2024 | 4:05 PM

విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో రాణించాలి

23-09-2024 01:29:32 PM

ఎస్జిఎఫ్ క్రీడాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 

దుబ్బాక,(విజయక్రాంతి): మిరుదొడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్) క్రీడ కార్యక్రమాన్ని దుబ్బాక శాసన సభ్యులు, కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు.

అండర్ 14, అండర్ 17 విభాగంలో నిర్వహించిన క్రీడల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చాటి చెప్పారని మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. క్రీడ కార్యక్రమానికి అయే ఖర్చులను అందజేస్తున్నటువంటి తోట కమలాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య పాటు ఎంఈఓ ప్రభుదాస్, ఎంపిడిఓ, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిఈటిలు, స్థానిక మండల పార్టీల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.