30-04-2025 12:00:00 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 29 : కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో మంగళవారం హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ధర్మకర్తలు మధు సాగర్, అంజి రెడ్డి, యాది రెడ్డి, సురేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది వెంకటయ్య, అర్చకులు శంకర్ ప్రసాద్, అంబప్రసాద్, చంద్రకాంత్ శర్మ, ముత్యాల శర్మ, సంతోష్ కుమార్, శ్రవణ్ తదితరులు పూజలు నిర్వహించి, ఆశీర్వచనం అందజేశారు.