calender_icon.png 6 February, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ ఫౌండేషన్ సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

06-02-2025 09:05:46 PM

నాగారం: ప్రజాసేవ చేసేందుకు ఎస్ ఫౌండేషన్ స్థాపించినట్లు మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. నాగారం మండల కేంద్రంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడోత్సవాలు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామస్థాయి క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడుతూ... ఎస్ ఫౌండేషన్ ద్వారా అనేకమంది నిరుపేదలకు సేవ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ఎస్ ఫౌండేషన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు. రాజకీయాలకతీతంగా కులమతాలకు అతీతంగా సేవ చేయడమే ఎస్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా క్రికెట్ కబడ్డీ వాలీబాల్ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన వారికి 25 వేల రూపాయల నగదు షీల్డ్ను ద్వితీయ బహుమతి పొందిన వారికి 20 వేల రూపాయల నగదు షీల్డ్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జీడి బిక్షం గుండ గాని అంబయ్య కల్లెట్లపల్లి ఉప్పలయ్య, చిప్పలపెల్లి చిరంజీవి, కూరం మణి వెంకన్న, గుంటకండ్ల మణిమాల దోమల బాలమల్లు, చంద్రమౌళి, సోమయ్య, వెంకన్న సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.