15-04-2025 08:08:53 PM
చెన్నూరు (విజయక్రాంతి): చెన్నూరు మండలంలోని ముత్తరావుపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, అయిత హిమవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.