15-04-2025 12:43:11 AM
పటాన్ చెరు, ఏప్రిల్ 14 :రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రైతులను కోరారు.
పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.