మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో రైతుల సహకారంతో నూతనంగా నిర్మించిన బస్టాండ్ ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు అందరూ కలిసి ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి రైతే రాజు అని నిరూపించినటువంటి రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, స్థానిక రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.