10-04-2025 08:08:47 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతు యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, హనుమంతు యాదవ్ కు శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడంతో ఎమ్మెల్యేకు యూత్ కాంగ్రెస్ నాయకులు హనుమంతు యాదవ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి పటేల్, హనుమాన్ మందిర చైర్మన్ రామ్ పటేల్, మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు, స్వామి, విట్టల్, గురూజీ, మాజీ ఎంపీపీ, ప్రజ్ఞకుమార్ కొండ, గంగాధర్, వట్నాల, రమేష్, బండి గోపి, తదితరులు పాల్గొన్నారు.