calender_icon.png 8 September, 2024 | 9:05 AM

మైనార్టీల విషయంలో బడే బాయ్ తరహాలోనే చోటా బాయ్

27-07-2024 02:50:29 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైనా మీటర్లు పెట్టిందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. కానీ 2018 డిసెంబర్ లోపే విద్యుత్ మీటర్లు బిగిస్తామని కేసీఆర్.. కేంద్రానికి చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ మీటర్ల విషయంలో ఒప్పందాలు చేసుకుని అబద్ధాలు చేప్తున్నారని తెలిపారు. 2017 జనవరి 4న ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. దీనిపై హరీశ్ రావు మాట్లాడుతూ.. మీటర్లు పెట్టి ఎఫ్ఆర్బీఎం ద్వారా రూ.30 వేల కోట్ల రుణాలు తీసుకున్నామా? మైనార్టీల విషయంలో బడే బాయ్ తరహాలోనే చోటా బాయ్ కూడా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి, ఎమ్మెల్సీ ఇవ్వలేదని హరీశ్ రావు ఆరోపించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న విషయాన్ని గుర్తుచేశారు. బేషజాలకు పోకుండా హామీలు అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేసిండు.