01-03-2025 07:44:48 PM
పటాన్ చెరు: గుండె ఆపరేషన్ చేసుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో శనివారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. భగవంతుని కృపతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.