calender_icon.png 22 October, 2024 | 1:45 PM

ఎమ్మెల్యే గంగులకు మాతృ వియోగం

22-10-2024 11:44:10 AM

కరీంనగర్, (విజయక్రాంతి): మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నర్సమ్మ మంగళవారం ఉదయం పరమపదించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సమ్మ తుదిశ్వాస విడిచారు. దుబాయి పర్యటనలో ఉన్న గంగుల కమలాకర్ హుటాహుటిన బయలుదేరారు. బుధవారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి. మేయర్ సునీల్ రావు, బిఆర్ఎస్ నగర అధ్యక్షడు హరిశంకర్ లు గంగుల నివాసానికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు వేరు వేరు ప్రకటనలో నివాళులు అర్పించారు.