24-04-2025 10:47:47 PM
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): నియోజకవర్గ పర్యటనలో భాగంగా శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipally Venkataramana Reddy) గురువారం కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులను తాగునీటి సమస్య, వివిధ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలనీ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత తొందరలో సమస్య తీరుతుందని మాట ఇవ్వడం జరిగింది.