18-04-2025 08:28:35 PM
పెనుబల్లి,(విజయక్రాంతి): పెనుబల్లి మండల పరిధిలో నీలాద్రి గుడి ప్రాంగణంలోని అడవి ప్రాంతంలో మూగ జివాలకు ఆహారం అందించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. మూగ జివాలకు ఆహారం అందించినప్పుడల్లా మాకు ఎంతో సంతోషం గా ఉంటుంది అని తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దంపతులు కాస్త విరామ సమయం లో మూగ జివాలకు ఆహారం అందించారు. మీ ఫంక్షన్స్ లో ఒక వేళ ఉండిన ఆహారం మిగిలిపోతే వాటిని మీ దగ్గర లోగల మూగ జీవాలు ఉన్న ప్రాంతాలలో ఆహారం అందించండి అనిప్రజలకు పిలుపునిచ్చారు.