calender_icon.png 15 October, 2024 | 7:52 PM

ఇన్చార్జి మంత్రిని కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గ నాయకులు

15-10-2024 05:45:19 PM

నిజాంసాగర్: హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ జూపల్లి కృష్ణారావును సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన నాయకులు అడ్వకేట్ రామ్ రెడ్డి బోడ్ల రాజు పిట్లం మాజీ జడ్పిటిసి మురళి గౌడ్, నిజాంసాగర్ మహమ్మద్ నగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలే మల్లికార్జున్ రవీందర్ రెడ్డి నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండల నాయకులు గుర్రపు శ్రీనివాస్ పటేల్, మనోజ్ కుమార్, మల్లయ్య గారి ఆకాష్, వెంకట్ రెడ్డి శపథం రెడ్డి తోటరాజుతో పాటు ఆయా మండలాలకు చెందిన నాయకులు ఉన్నారు.