calender_icon.png 5 October, 2024 | 8:29 PM

ఏటీసీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

05-10-2024 05:14:30 PM

మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో రూ.4కోట్ల 60 లక్షలతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటిసి) భవనానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు అనేకమైన వసతులు కల్పిస్తుందని వాటిని ప్రతి ఒక్క విద్యార్థులు వినియోగించుకోవాలని అన్నారు.ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి ప్రభాకర్ , సూపరింటెండెంట్ జ్యోతి,రాణి , ట్రైనింగ్ ఆఫీసర్ జి రవి,ఎస్డి ఇఫ్తాకర్ సీనియర్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్స్ జీవీ కృష్ణారావు, ఎం శ్రీనివాస్, ఏ నర్సయ్య, వేణుగోపాల్,  మణుగూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.