calender_icon.png 25 September, 2024 | 7:57 PM

జలకలను సంతరించుకున్న కాలువలు, చెరువులు, కుంటలు

25-09-2024 05:17:53 PM

పూజలు జరిపిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య 

యాదాద్రి భువనగిరి,(విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు నిండి మత్తడీ దూకుతుండడంతో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్నసాగర్ నుండి గంధమల్ల కు నీటిని విడుదల చేయాలని *ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలేరు మార్కెట్ కమిటీ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఎంపీ చామల కిరణ్ కుమార్ కోరగా,,10 గంటలల్లో నీటిని విడుదల చేసారు.దీంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు,రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గంధమల్ల చెరువు నీండి మత్తడి పోస్తూ కింద ఉన్నటువంటి పలు గ్రామాల చెరువులు, కాలువలు, నిండి జలకళ ను సంతరించుకుంటున్నాయి. అంతముందుకు జగదేవ్ పూర్, మండలం గంధమల్ల సమీపంలో ఉన్నటువంటి మదన దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని వేడుకున్నారు.