20-03-2025 10:24:24 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన కంపెల మానస (22) బుధవారం సాయంత్రం బ్యాంకు పనిమీద ఇంట్లో నుండి బయటకు వెళ్లి అదృశ్యానికి గురైంది. ఆమె భర్త నగేష్, తల్లిదండ్రులు ఎక్కడ వెతికిన ఆచూకీ తెలియరాలేదు. బాధితురాలి తల్లి పాకాల స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ తెలిపారు.