calender_icon.png 22 October, 2024 | 4:52 AM

వివాహిత అదృశ్యం

20-10-2024 11:46:36 PM

ఎల్బీనగర్, అక్టోబర్ 20 : భర్తతో గొడవ పడిన వివాహిత అదృశ్యమైన ఘటన ఆదివారం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా ముబారక్ నగర్‌కు చెందిన పులి ప్రవీణ్‌కుమార్ (32), భార్య స్వాతి గత కొన్నేళ్లుగా నగరంలోని నాగోల్  ప్రాంతంలోని ఆనంద్ నగర్‌కాలనీ రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉం టున్నారు. ప్రవీణ్‌కుమార్ స్థానికంగా మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 19న రాత్రి భార్యాభర్తల మధ్యన గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన స్వాతి అదేరో జు రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తెల్లవా రుజామున స్వాతి కనిపించకపో యేసరికి భర్త ప్రవీణ్ కుమార్ నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.