calender_icon.png 20 September, 2024 | 4:37 PM

పటాన్‌చెరులో నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం

20-09-2024 02:59:16 PM

సంగారెడ్డి, (విజయక్రాంతి): బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యం అయిందని కుటుంబ సభ్యులు పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్‌చెరు పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీకి చెందిన సాత్విక (22) బిఎస్సి నర్సింగ్ చదువుతుందన్నారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో తాను ఫెయిల్ అయ్యానని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని తన ఫోన్లో వాయిస్ మెసేజ్ రికార్డు చేసి ఇంట్లో ఫోన్ పెట్టి పోయిందన్నారు. స్వాతిక కనిపించకపోవడంతో తమ్ముడు సాయికిరణ్ పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.