calender_icon.png 25 October, 2024 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు పిల్లలుసహా తల్లి అదృశ్యం

18-09-2024 12:26:30 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 17 : ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీలోని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన చింతపల్లి నరేంద్ర(34) భార్యాపిల్లలతో కలిసి నాగోల్‌లోని బండ్లగూడ పరిధి కృషినగర్‌లో నివాసం ఉంటున్నాడు. నరేంద్ర 2017లో భాగ్యలక్ష్మిని వివాహం చేసుకోగా.. భాగ్యలక్ష్మికి గతంలో వేరో వ్యక్తితో వివాహం జరగగా.. విడాకులు తీసుకుంది. వారికి ఒక కూతురు శ్రావణలక్ష్మి(11) ఉంది. కాగా.. నరేంద్ర ఇష్టపూర్వకంగానే పెద్దల సమక్షంలో భ్యాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.

జీవనోపాధికి నాగోల్‌లో ఉంటున్నాడు. భాగ్యలక్ష్మి, నరేంద్రకు కూతురు గగనశ్రీ ఉంది. అయితే ఇటీవల భాగ్యలక్ష్మి తరచూ ఫోన్లో ఇతరులతో మాట్లాడుతుండటంతో భర్త నరేంద్ర మందలిం చాడు. ఈ క్రమంలో సోమవారం స్థానికంగా ఉన్న వినాయకుడి వద్దకు వెళ్తున్నామని భర్తకు చెప్పి ఇద్దరు కూతుర్లతో పాటు వెళ్లిన శ్రావణలక్ష్మి తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభింలేదు. ఆమె నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ మేరకు నరేంద్ర మంగళవారం నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్థానికంగా ఉన్న ఓ యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.