టెల్అవీవ్, సెప్టెంబర్ 26: ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్లోని మొస్సాద్ ప్రధాన కార్యాలయమే లక్ష్యంగా హెజ్బొల్లా ఖాదర్ క్షిపణిని ప్రయోగించింది. హెజ్బొల్లా కమాండర్లపై దాడి, పేజర్లు, వాకీటాకీల పేల్చివేతలకు ప్రతీకారంగా ఈ దాడులకు తెగబడినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
హెజ్బొల్లా ప్రయోగించిన ఖాదర్ క్షిపణి లెబనానన్ గగనతలం దాటగానే మధ్యలోనే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుందని ఇజ్రాయెల్ దళాలు స్పష్టం చేశాయి. సీ ఆఫ్ గలీల్ దిశగా తమ భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్లను సైతం కూల్చినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం కూడా ఇజ్రాయెల్.. హెజ్బొల్లా స్థావరాలపై దాడులను కొనసాగాయి.