లైన్మెన్లను పోలీసులకు అప్పగించిన మహిళలు
కామారెడ్డి, జూలై 28 (విజయక్రాంతి): మహిళలతో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు లైన్మెన్లను పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్కాలనీలో గల డబుల్ బెడ్ రూమ్స్ సమీ పంలో గల ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైర్ కాలిపోయింది. లైన్ మెన్ గఫార్కు కాలనీవాసులు సమాచారం అందజేశారు. ఆదివారం సంఘటన స్థలానికి గఫార్తో పాటు మరో లైన్మెన్ రాజేందర్ వెళ్లారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైర్ మరమ్మతులు చేపట్టారు. అనంతరం స్ట్రీట్ లైట్లు సరిగ్గా రావడం లేదంటూ లైన్మెన్లను కాలనీ మహిళలు ప్రశ్నించడంతో లైన్మెన్లు దురుసుగా ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో మహిళలు లైన్మెన్లను ఘొరావ్ చేసి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అభస్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదని పోలీసులు తెలిపారు.