calender_icon.png 19 October, 2024 | 6:40 PM

హుజురాబాద్ లో మైనర్ బాలిక అదృశ్యం

19-10-2024 04:35:20 PM

బాలికను కిడ్నాప్ చేశారని స్థానికులు ఆరోపణ

హుజురాబాద్ (విజయక్రాంతి):16 ఏళ్ల బాలిక అదృశ్యమైన సంఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే  హుజురాబాద్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీకి చెందిన సాయిలు-కోమల దంపతుల కుమార్తె (16) శుక్రవారం సాయంత్రం కిరాణం షాపుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. శనివారం ఉదయం వరకు బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మైనర్ బాలిక ఇంటి సమీపంలోనే నివసించే శేఖర్ అనే వ్యక్తి కిడ్నాప్ కు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కిరాణం షాప్ కు వెళ్లి వస్తానని ఇంట్లో నుండి బయటకు వెళ్లగా బయట అప్పటికే ఆ యువతి కోసం కాచుకొని కూర్చున్న శేఖర్ యువతిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లినట్లు స్థానికులు ఆరోపించారు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సదరు యువతినీ శేఖర్ అనే వ్యక్తి భార్య పిల్లలు ఉండగా మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.